తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక ‘సాయిల్ హెల్త్ వాలంటీర్’ను నియమించి, నేల ఆరోగ్యంపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. సోమవారం పటాన్చెరులోని ఇక్రిశాట్ (ICRISAT)లో రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేల సారం కేవలం పంట దిగుబడికే కాకుండా మానవ ఆరోగ్యం,…