హైదరాబాద్లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరినట్లు తెలుస్తోంది. తాజాగా కల్తీ కల్లు సేవించి వాంతులు, విరోచనాలతో కూకట్పల్లి రాందేవ్ రావు ఆసుపత్రికి వచ్చే లోపే మౌనిక(25) అనే యువతి మృతి చెందింది. కానీ ముగ్గురు మాత్రమే మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. సీతారం, స్వరూప, మౌనిక మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. నారాయణమ్మ, బొజ్జయ్య అనే ఇద్దరు కూడా కల్తీ కల్లు తాగడం వల్లే చనిపోయినట్లు తెలుస్తోంది.
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆసుపత్రి భవనం ఎక్కి యువకులు హల్ చల్ చేసిన తీరు జిల్లాలో సంచలనంగా మారింది. మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.