Siddique Kappan : కేరళకు చెందిన సిద్ధిక్ కప్పన్ అనే జర్నలిస్ట్ ఉత్తరప్రదేశ్లో రెండేళ్ల క్రితం అరెస్టయ్యాడు. యువతిపై అత్యాచారం, హత్య ఆరోపణలపై నివేదించేందుకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
కేరళ జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్ బెయిల్ పిటిషన్పై సమాధానమివ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్. జస్టిస్ ఎస్. రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం సిద్ధిక్ కప్పన్ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.