Reliance Industries: భారత స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు శుక్రవారం ట్రేడింగ్లో భారీగా పతనమయ్యాయి. డీజిల్, ఏటీఎఫ్ (విమాన ఇంధనం) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విండ్ఫాల్ పన్నును తిరిగి విధించడమే ఈ పతనానికి ప్రధాన కారణం అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రిలయన్స్ షేర్లు 4 శాతానికి పైగా క్షీణించాయి, ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.82,000 కోట్లు మేర పడిపోయింది. దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం, సరఫరాలో కొరత…