అయోధ్యలో రామ మందిర నిర్మాణం పనులు శర వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది 2024 జనవరిలో ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా.. శ్రీరామ నవమి వేడుకలను అయోధ్య రామ మందిరంలో నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తుంది. ఇదిలా ఉంటే.. అయోధ్య రామ మందిరంలో ఉండే రాముడి విగ్రహాన్ని ఓ రహాస్య ప్రాంతంలో ముగ్గురు శిల్పులు చెక్కుతున్నారు.