ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చేందుకు.. పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘నాడు-నేడు’ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఇప్పటికే చాలా పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి.. మరికొన్ని స్కూళ్లలో పనులు జరుగుతున్నాయి.. కానీ, కర్నూలు జిల్లాలో పాఠశాల కంట్రాక్టర్ నిర్లక్ష్యంతో గోడ కూలి టీచర్, విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే, టీచర్ అప్రమత్తతతో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. జిల్లాలోని కౌతాళం మండలం హాల్వీ ఎలిమేంటరీ స్కూల్లో ఈ ఘటన…