Sangareddy: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని వివిన్ పరిశ్రమలో 300 మంది కార్మికుల ఆందోళన చేపట్టారు. గత కొన్ని నెలలుగా యాజమాన్యం జీతాలు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్లో డబుల్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. జల్సాలకు అలవాటుపడి తల్లి ఒంటిపై బంగారం కోసం తల్లిదండ్రులను హతమార్చాడు ఓ కసాయి కొడుకు. గత నెల 22న ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన 25 రోజుల తర్వాత ఈ కేసులో మిస్టరీ వీడింది.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో గల కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్బీ కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎగిరిపడ్డారు.
సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భూకంపం వచ్చింది. న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో స్థానికులు ఇళ్లనుంచి భయంతో పరుగులు తీశారు. కాగా.. ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు అక్కడి జనాలు చెబుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం పట్టణంలో వివిధ పోలింగ్ బూతులను రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పరిశీలించారు.
సంగారెడ్డి జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి తన అరాచకత్వాన్ని ప్రదర్శించారు. చిన్నారి అత్యాచారం కేసులో వచ్చిన 5 లక్షల ఎక్స్ గ్రేషియాలో సంగారెడ్డి జిల్లా సీనియర్ అసిస్టెంట్ వాటా అడిగాడు.
Harish Rao: తెలంగాణ భూముల రేట్లు పెరగడానికి కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు సర్టిఫికెట్లు అందజేశారు. సంగారెడ్డి జిల్లా లో 86% ప్రసవాలు ప్
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో ఆగివున్న బస్సును గోవా నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇస్నాపూర్ ఎస్బిఐ బ్యాంక్ దగ్గర ఘటన జరిగింది.