కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్పన్ ఆర్కె రోజా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అని తెలిసి చాలా బాధపడ్డాను. షాక్ అయ్యాను. పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. వియ్ విల్ మిస్ యూ అంటూ రోజా ట్వీట్ చేశారు.…
మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలపై సినీ నటి, ఎమ్మెల్యే రోజా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలను తలపిస్తున్నాయని… గతంలో ఎన్నడూ ఇలా ప్రచారం, హడావుడి జరగలేదని చెప్పారు. నేను లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ ను తాను నమ్మనని…ఆ విషయానికి వస్తే హీరోయిన్లు అందరూ నాన్ లోకాలేనని చురకలు అంటించారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఆలింగనం చేసుకోవడం మంచిదేనన్నారు రోజా. ఎవరు గెలిచినా మా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం…
ఈసారి ‘మా’ ఎన్నికలు వాడివేడిగా సాగుతున్నాయి. మంచు విష్ణు ప్యానల్, ప్రకాష్ రాజ్ ప్యానల్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అక్టోబర్ 10న ‘మా’ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. టాప్ సెలెబ్రిటీలు, సీనియర్ హీరోహీరోయిన్లు సైతం మీడియా ముందుకు వచ్చి తమ సపోర్ట్ ఎవరికీ అనే విషయాన్ని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే…
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని ఉద్యమం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత కూడా అదే విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల నేతలు జల వివాదంపై పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. వాటాల విషయంలో వివాదం రోజురోజుకు పెరిగిపోతున్నది. జలవివాదంపై నగరి ఎమ్మెల్యే రోజా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రెండురాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని, కేంద్రం…
కరోనా సమయంలో కనీసం ప్రజలకు అందుబాటులో ఉండని తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు.. హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం హాస్యాస్పదం.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం విడ్డూరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. మరోవైపు.. నారా లోకేష్పై సెటైర్లు వేశారు రోజా.. తనలాగే రాష్ట్రంలోని విద్యార్థి, విద్యార్థులు దద్దమ్మల, చవటల తయారవ్వాలననే దురాలోచనతో పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు… ప్రజలకి వాక్సిన్ అందరికీ…