CM Revanth Reddy: రైతు భరోసా అందిస్తే ముక్కు నేలకు రాస్తావా? అని కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పోరాటాల చరిత్ర ఖమ్మం ఎప్పుడూ ముందు వుంటుందన్నారు.
రాష్ట్రప్రభుత్వం అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించకపోవడం దురదృష్టకరం అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అధికారుల వ్యవహారశైలి కూడా కేసీఆర్ కు అనుగుణంగా ఉంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అధికారులపై తక్షణమే చర్యలు తీసకోవాలి. గత మూడు నెలలుగా తెలంగాణ రైతాంగం వరిధాన్యం అమ్ముకోలేక అవస్థలుపడుతున్నారు.