కర్నాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ మతగురువు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దెయ్యం పట్టిందనే నెపంతో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో.. మతగురువును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు స్వస్థలం ఉత్తరప్రదేశ్ కాగా.. స్థానిక మసీదులో ఉంటున్నాడు. అయితే.. బాలిక మూడేళ్లుగా ఖురాన్ అధ్యయనాలకు హాజరవుతూ ఉంటుంది.