Namo Bharat: భారతదేశంలో వేగవంతమైన ట్రైన్ ఏదంటే ‘‘వందే భారత్’’ అనే సమాధానం వచ్చేంది. అయితే, ఇప్పుడు అది మారిపోయింది. ఢిల్లీ -మీరట్ కారిడార్లో ప్రయాణించిన ‘‘నమో భారత్’’ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి, దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా అవతరించింది. వందే భారత్ రికార్డును బద్దలు కొట్టింది. ఢిల్లీ నుంచి మీరట్ వరకు 84 కి.మీ RRTS కారిడార్ను రూ.30,274 కోట్లతో నిర్మిస్తున్నారు.
అంతరిక్ష రంగ అభివృద్ధికి ప్రభుత్వం రోడ్మ్యాప్ను రూపొందించిందని, స్వదేశీయంగా నిర్మించిన అంతరిక్ష నౌకలో భారతీయుడు చంద్రునిపైకి వెళ్లే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు.