Namo Bharat: స్పీడ్లో ‘‘వందేభారత్’’ను మించింది.. అత్యంత వేగవంతమైన రైలుగా ‘‘నమో భారత్’’
- స్పీడ్లో వందే భారత్ను మించిన ‘‘నమో భారత్’’..
- దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా అవతరణ..
- ఢిల్లీ-మీరట్ మార్గంలో గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namo Bharat: భారతదేశంలో వేగవంతమైన ట్రైన్ ఏదంటే ‘‘వందే భారత్’’ అనే సమాధానం వచ్చేంది. అయితే, ఇప్పుడు అది మారిపోయింది. ఢిల్లీ -మీరట్ కారిడార్లో ప్రయాణించిన ‘‘నమో భారత్’’ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి, దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా అవతరించింది. వందే భారత్ రికార్డును బద్దలు కొట్టింది. ఢిల్లీ నుంచి మీరట్ వరకు 84 కి.మీ RRTS కారిడార్ను రూ.30,274 కోట్లతో నిర్మిస్తున్నారు.
వందేభారత్కు ముందు దేశంలో అత్యంత వేగమైన రైలుగా ‘‘గతిమాన్ ఎక్స్ప్రెస్’’కు పేరుండేది. దీనిని 2016లో ప్రారంభించారు. దేశంలో తొలి సెమీ-హై స్పీడ్ రైలు ఇదే. ఇది హజరత్ నిజాముద్దీర్-ఆగ్రాల మద్య ఏర్పాటు చేసిన ట్రాక్పై గంటకు 160 కి.మీ వేగంతో నడిచేది. ఆ తర్వాద వందేభారత్ ట్రైన్ వేగవంతమైన ట్రైన్గా నిలిచింది. అయితే, రైల్వే మంత్రిత్వ శాఖ జూన్ 24, 2024లో ఎలాంటి కారణాలు పేర్కొనకుండా వాటి వేగాన్ని గంటకు 160 నుంచి 130 కి.మీ తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం, భారత్లో అన్ని రైళ్లు గంటకు 130 కి.మీ గరిష్ట వేగ పరిమితితో నడుస్తున్నాయి.
Also Read
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
Read Also: Nalgonda: పదో తరగతి విద్యార్థినిపై ప్రభుత్వ ఉపాధ్యాయుడి వేధింపులు.. మూడు నెలలుగా…
తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మరియు ఉత్తరప్రదేశ్లోని మీరట్ సౌత్ మధ్య సేవలందిస్తున్న నమో భారత్ రైలు ఈ మార్గంలోని 11 స్టేషన్లలో కొన్నింటి మధ్య కొన్ని సెకన్ల పాటు గరిష్టంగా 160 కి.మీ/గంట వేగాన్ని చేరకుంటుంది. ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ మోడీపురం వరకు 16 స్టేషన్లతో కూడి మొత్తం 82.15 కిమీ. పొడవైన కారిడార్ త్వరలో ప్రారంభించే అవకాశం ఉందని అని నేషనల్ క్యాపిటల్ రీజినల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NCRTCL) అధికారులు తెలిపారు. భారత ప్రభుత్వం (50 శాతం), ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాల (ఒక్కొక్కటి 12.5 శాతం) జాయింట్ వెంచర్ అయిన NCRTC దేశంలోని మొట్టమొదటి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ను అమలు చేస్తోంది.
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!