వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘రావు బహదూర్’. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అగ్ర నటుడు మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పిస్తున్న ఈ చిత్రం తాజాగా మరో ముఖ్యమైన అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ‘రావు బహదూర్’ టీజర్ విడుదలైంది. “నాకు అనుమానం అనే భూతం పట్టిందంటూ..” అనే ఆసక్తికరమైన డైలాగ్తో టీజర్ మొదలై, మరింత సస్పెన్స్, థ్రిల్ను రేకెత్తించేలా రూపొందించబడింది. Also Read…