వైసీపీ నేత బోరుగడ్డ అనిల్కు పోలీసుల రాచ మర్యాదలు అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారిపోయింది.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఓ రెస్టారెంట్లో విందు భోజనం అంటూ పోలీసులపై విమర్శలు వెల్లివెత్తాయి.. ఇక, టీడీపీ కార్యకర్తలు సెల్ఫోన్లో ఈ వ్యవహారాన్ని వీడియో చిత్రీకరిస్తుండగా.. ఫోన్ లాక్కుని వీడియో డిలీట్ చేశారంటూ పోలీసులపై మండిపడ్డారు.. ఈ వ్యవహారం అంతా వివాదాస్పదం కావడంతో.. పోలీసులపై వేటు పడింది