భారతీయ సినీ చరిత్రలో ‘రామాయణం’ వెండితెరపై ఆవిష్కృతమవుతుందంటే ప్రేక్షకుల్లో ఉండే ఉత్కంఠే వేరు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, మన సౌత్ బ్యూటీ సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గతంలో బుల్లితెర రామాయణంలో రాముడిగా నటించి ప్రజల గుండెల్లో దేవుడిలా…