‘సూపర్ స్టార్’ రజనీకాంత్పై తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ, సామాజిక వివాదానికి దారి తీసాయి. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ రజనీకాంత్ను గౌరవిస్తారని, ఆయన రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. టీవీకే పార్టీ రజనీకాంత్కు క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. రజినీకాంత్ వ్యక్తిత్వం గురించి బహిరంగంగా…