ఎడారి దేశం ఈజిప్ట్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది పిరమిడ్స్. వేల సంవత్సరాల క్రితం పిరమిడ్స్ ను నిర్మించారు. ఎందరో పిరమిడ్స్పై పరిశోధనలు చేశారు. అందులోని సంపదను కొల్లగొట్టారు. మమ్మీలను దొంగిలించారు. పిరమిడ్లు నిర్మించిన సమయానికే ఆ దేశంలో గొప్ప సంస్కృతి వెల్లివిరిసింది. కాల క్రమేణా ఆ సంస్కృతి, అప్పటి భవనాలు పుడమిగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు కొన్ని శిధిలాలు మాత్రమే అప్పటి సంస్కృతికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. Read: విద్యాసంస్థల్లో కరోనా టెన్షన్… 72 గంటల్లో……
ప్రపంచంలో పురాతనమైన కట్టడాలు ఏవి అంటే పిరమిడ్లు అని చెప్తారు. ఈజిప్ట్ లో ఉన్న ఈ పిరమిడ్ లను సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు వస్తుంటారు. ఇక ఈజిప్టు రాజధాని నగరం కైరోకు దక్షిణ ప్రాంతంలోని సక్కార పిరమిడ్ ఉన్నది. ఈ పిరమిడ్ లో 4700 సంవత్సరాల నాటి సమాధి ఉన్నది. ఇది కింగ్ జోజర్ సమాధి. క్రీస్తుపూర్వం 2667-2648 మధ్యాకాలంలో నిర్మించి ఉంటారని చరిత్రను బట్టి తెలుస్తున్నది. కైరోను సందర్శించే టూరిస్టులు ఈ సమాధిని…