కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇళ్లకు ఈ మేరకు నోటీసులు అంటించారు పోలీసులు..
పులివెందులలోని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు మరోసారి వెళ్లారు. హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాష్ రెడ్డి వస్తున్నారు. ఇప్పటికే పులివెందులలోని అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు ఇద్దరు సీబీఐ అధికారులు చేరుకున్నారు. మరోసారి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసు ఇచ్చే అవకాశం ఉంది.