Priest Suicide: కాళీమాత తనకు దర్శనం ఇవ్వలేదని ఓ పూజారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వారణాసిలో చోటు చేసుకుంది. 24 గంటల పాటు ప్రార్థన నిర్వహించినా కాళీమాత తనకు కనిపించలేదని 45 ఏళ్ల పూజారి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆదివారం సాయంత్రం గైఘాట్ పతంగలిలోని తన అద్దె నివాసంలో అమిత్ శర్మ గొంతు కోసుకున్నాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అతను మరణించారు.