కొత్త ప్రభాకర్ రెడ్డి, బాలరాజుపై కాంగ్రెస్ దాడి చేయించిందా అని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్సే దాడి చేయించిందని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్కు టీడీపీ మద్దతు ఇస్తుందని అనుకుంటున్నామని ఆయన తెలిపారు.
ప్రజలు ఏ పార్టీని కోరుకుంటున్నారనే చూసే కాంగ్రెస్లో చేరానని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ప్రజల అభిప్రాయాలు తీసుకున్నానని ఆయన తెలిపారు. నాకు స్వార్థం ఉంటే అధికార పార్టీలోనే ఉండే వాడినని ఆయన వెల్లడించారు.