Chairmans Desk: ఏపీలో రాజకీయం సరికొత్త లోతులకు దిగజారుతోంది. అధికారం మారితే.. ఇన్నాళ్లూ కొన్ని ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయిపోవడం.. మరికొన్ని ప్రాంతాల్లో ఓ వర్గం మరో వర్గం కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం రాష్ట్రానికి ఎప్పట్నుంచో అనుభవమే. కానీ ఇప్పుడు కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షంలో ఉన్నవారెవరికీ రక్షణ ఉండదని తేలిపోయింది. వైసీపీ హయాంలో ఓ నేత ఏకంగా మాజీ సీఎం నివాసంపైకి దూసుకెళ్లడం కలకలం రేపింది. జడ్ ప్లస్ క్యాటగిరీలో ఉన్న వ్యక్తి మీదకు అలా…