నవ్య ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసుల తనిఖీలపై మండిపడ్డారు పీవో డబ్ల్యు సంధ్య. సాయంత్రం 5 గంటల సమయంలో మా ఇంటికి పోలీసులు వచ్చి మా భర్తను ప్రింటింగ్ ప్రెస్ కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ప్రింటింగ్ ప్రెస్ లో 50 మంది పోలీసులు వచ్చి బీభత్సం సృష్టించారన్నారు సంధ్య. ప్రింటింగ్ ప్రెస్ లో ఉన్న కంప్యూటర్లను, హార్డ్ డిస్క్ లను, ప్రింట్ అయిన పుస్తకాలను పోలీసులు తీసుకెళ్లారు. మా భర్తను అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.…
హైదరాబాద్ లో ఒక వైపు గంజాయి, డ్రగ్స్ మరోవైపు నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కోట్ల నకిలీ కరెన్సీ పట్టుకున్నారు. ఈ కేసుకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల వద్ద ఉన్న బ్యాగులో 500, 2000 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్ ఐ దాస్, లక్ష్మీ నారాయణలతో కలిసి పట్టుకున్నారు గోల్కొండ ఇన్ స్పెక్టర్ సముద్ర శేఖర్. 7 టూంబ్స్ బస్…
భారీగా గుట్కా, ఖైనీ నిల్వలు స్వాధీనం చేసుకున్నారు గుంటూరు రూరల్ పోలీసులు. 97లక్షల 72వేల విలువైన గుట్కా నిల్వలను పట్టుకున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఆరుగురి నిందితులను అరెస్టు చేసారు. వారం రోజులుగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. ఈ గుట్కా ర్యాకెట్ కేసు వివరాలను వెల్లడించిన రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ… బెంగళూరుకు చెందిన తయారీదారు సిద్ధప్ప గుట్కా ర్యాకెట్లో కీలక పాత్రధారిగా గుర్తించాం అన్నారు. ఇక్కడ నుంచి రాష్ట్రంలో 8 జిల్లాల్లోకి గుట్కా…