PM Modi: రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు ఒక కులాన్ని మరో కులంపైకి కాంగ్రెస్ ఉసిగొల్పుతోందని ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీలను విభజించాలని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయని ఆయన అన్నారు. జార్ఖండ్లోని బొకారోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు.