PM Modi: “ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే”.. జార్ఖండ్లో నినదించిన మోడీ..
- ఐక్యంగా ఉంటేనే సురక్షితం..
- జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో నినదించిన మోడీ..
- కాంగ్రెస్ దాని మిత్రపక్షాలపై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు ఒక కులాన్ని మరో కులంపైకి కాంగ్రెస్ ఉసిగొల్పుతోందని ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీలను విభజించాలని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయని ఆయన అన్నారు. జార్ఖండ్లోని బొకారోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. “ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే” అనే నినాదాన్ని ఉపయోగించారు. ‘‘మనమంతా ఒకటిగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం’’ అని నినదించారు.
90వ దశకంలో ఓబీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించిన తర్వాత కాంగ్రెస్ ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల్లో 250 సీట్లను దాటలేదని, కాబట్టి కాంగ్రెస్ ఓబీసీ కమ్యూనిటీని విచ్ఛిన్నం చేయాలని, అనేక కులాలను విభజించాలని కోరుకుంటోందని ప్రధాని ఆరోపించారు. ఓబీసీల ఐక్యత దేశాన్ని బలోపేతం చేసిందని అన్నారు. కాంగ్రెస్, జేఎంఎం పార్టీలు ఓబీసీలు తమలో తాము పోరాడాలని ప్లాన్ చేస్తున్నాయంటూ ఆరోపణలు చేవారు. ‘‘ఓబీసీ కమ్యూనిటీ విచ్ఛిన్నం కావాలని మీరు అనుకుంటున్నారా..? మీరు విడిపోతే మీ గొంతు బలహీనపడుతుంది. ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’’ అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
Also Read
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్ఫుల్ బోర్డు
Read Also: Jammu Kashmir: విలేజ్ గార్డుల్ని చంపిన టెర్రరిస్టులు ట్రాప్.. కొనసాగుతున్న ఎన్కౌంటర్..
జార్ఖండ్కు చెందిన చాలా మంది యువకులు ఆర్మీలో ఉన్నారని ప్రధాని చెప్పారు. ‘‘జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 వల్ల మనం చాలా మంది జవాన్లను కోల్పోయాం. మోడీ ఈ గోడను బద్దలు కొట్టారు. కానీ కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు ఇది ఇష్టం లేదు. దేశానికి స్వాతంత్య్రం, రాజ్యాంగం వచ్చిన ఏడు దశాబ్ధాల వరకు అంబేద్కర్ రాజ్యాంగం కాశ్మీర్లో అమలు కాలేదు. అక్కడి దళితులు, ఆదివాసీలకు రిజర్వేషన్లు లభించలేదు. ఆర్టికల్ 370 తొలిగిన తర్వాత, అక్కడ అంబేద్కర్ రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేశారు’’ అని మోడీ అన్నారు.
రాష్ట్రంలోనికి బంగ్లాదేశ్ చొరబాట్లను అడ్డుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు. జార్ఖండ్ తన కుమార్తెలు, ప్రజల ఆధీనంలో ఉన్న భూమి భద్రత కోసం ఎన్డీయే ప్రభుత్వం అవసరమని ప్రధాని మోడీ అన్నారు. దేశంలో అత్యంత సంపన్నమైన జార్ఖండ్ని మనం నిర్మించాలని, తాను జార్ఖండ్ ప్రజల సాయం, ఆశీర్వాదం కోసం వచ్చామని, బీజేపీని గెలిపించాలని ఆయన అన్నారు. జార్ఖండ్లో నవంబర్ 13 మరియు 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లు లెక్కించబడతాయి.
తాజావార్తలు
-
BRS MLAs: కేటీఆర్, హరీశ్రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అరెస్ట్
-
Asian Games Cricket Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3న రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్లు!
-
Rohit Sharma: బుల్లితెరపై రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!
-
Steel Tap Cleaning Tips: జిడ్డుగా మారిన స్టీల్ ట్యాప్ల క్లీనింగ్కు బెస్ట్ చిట్కా.. 2 నిమిషాల్లో క్లీనింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!