PM Modi: “ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే”.. జార్ఖండ్లో నినదించిన మోడీ..
- ఐక్యంగా ఉంటేనే సురక్షితం..
- జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో నినదించిన మోడీ..
- కాంగ్రెస్ దాని మిత్రపక్షాలపై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు ఒక కులాన్ని మరో కులంపైకి కాంగ్రెస్ ఉసిగొల్పుతోందని ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీలను విభజించాలని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయని ఆయన అన్నారు. జార్ఖండ్లోని బొకారోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. “ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే” అనే నినాదాన్ని ఉపయోగించారు. ‘‘మనమంతా ఒకటిగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం’’ అని నినదించారు.
90వ దశకంలో ఓబీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించిన తర్వాత కాంగ్రెస్ ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల్లో 250 సీట్లను దాటలేదని, కాబట్టి కాంగ్రెస్ ఓబీసీ కమ్యూనిటీని విచ్ఛిన్నం చేయాలని, అనేక కులాలను విభజించాలని కోరుకుంటోందని ప్రధాని ఆరోపించారు. ఓబీసీల ఐక్యత దేశాన్ని బలోపేతం చేసిందని అన్నారు. కాంగ్రెస్, జేఎంఎం పార్టీలు ఓబీసీలు తమలో తాము పోరాడాలని ప్లాన్ చేస్తున్నాయంటూ ఆరోపణలు చేవారు. ‘‘ఓబీసీ కమ్యూనిటీ విచ్ఛిన్నం కావాలని మీరు అనుకుంటున్నారా..? మీరు విడిపోతే మీ గొంతు బలహీనపడుతుంది. ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’’ అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
Read Also: Jammu Kashmir: విలేజ్ గార్డుల్ని చంపిన టెర్రరిస్టులు ట్రాప్.. కొనసాగుతున్న ఎన్కౌంటర్..
జార్ఖండ్కు చెందిన చాలా మంది యువకులు ఆర్మీలో ఉన్నారని ప్రధాని చెప్పారు. ‘‘జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 వల్ల మనం చాలా మంది జవాన్లను కోల్పోయాం. మోడీ ఈ గోడను బద్దలు కొట్టారు. కానీ కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు ఇది ఇష్టం లేదు. దేశానికి స్వాతంత్య్రం, రాజ్యాంగం వచ్చిన ఏడు దశాబ్ధాల వరకు అంబేద్కర్ రాజ్యాంగం కాశ్మీర్లో అమలు కాలేదు. అక్కడి దళితులు, ఆదివాసీలకు రిజర్వేషన్లు లభించలేదు. ఆర్టికల్ 370 తొలిగిన తర్వాత, అక్కడ అంబేద్కర్ రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేశారు’’ అని మోడీ అన్నారు.
రాష్ట్రంలోనికి బంగ్లాదేశ్ చొరబాట్లను అడ్డుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు. జార్ఖండ్ తన కుమార్తెలు, ప్రజల ఆధీనంలో ఉన్న భూమి భద్రత కోసం ఎన్డీయే ప్రభుత్వం అవసరమని ప్రధాని మోడీ అన్నారు. దేశంలో అత్యంత సంపన్నమైన జార్ఖండ్ని మనం నిర్మించాలని, తాను జార్ఖండ్ ప్రజల సాయం, ఆశీర్వాదం కోసం వచ్చామని, బీజేపీని గెలిపించాలని ఆయన అన్నారు. జార్ఖండ్లో నవంబర్ 13 మరియు 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లు లెక్కించబడతాయి.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!