ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. 1935 ఆగస్ట్ 15న కారంచేడులో జన్మించిన రాజేంద్రప్రసాద్ 1959 నుంచి 65 వరకూ చీరాలలో బెంచ్ మెజిస్ట్రేట్ గా పని చేశారు. ఆ తర్వాత రామానాయుడుతో కలసి కారంచేడులో రైస్ మిల్ నిర్వహించిన రాజేంద్రప్రసాద్ రామానాయుడు, మిత్రుడు జాగర్లమూడి సుబ్బారావుతో కలసి సురేశ్ సంస్థను స్థాపించారు. అందులో రాజేంద్రప్రసాద్, సుబ్బారావుది 40 శాతం. ‘రాముడు-భీముడు, శ్రీకృష్ణ తులాభారం, ప్రతిజ్ఞ, స్త్రీ జన్మ, ఒక చల్లని…