తమిళ డైరెక్టర్ జి.మోహన్ అరెస్ట్ అయ్యారు. తమిళనాడులోని పళని ఆలయంలో వడ్డించే పంచామృతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను మంగళవారం ఉదయం చెన్నై రాయపురంలోని ఆయన నివాసంలో తిరుచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. డైరెక్టర్ మోహన్ను పోలీసులు తిరుచ్చికి తరలించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే మోహన్ను అరెస్ట్ చేశారని చెన్నై బీజేపీ అధ్యక్షుడు అంటున్నారు. పళని ఆలయం ప్రసాదంపై డైరెక్టర్ జి.మోహన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఓ వీడియోలో మాట్లాడుతూ..…