Bhadrachalam: శ్రీరామనవమిని పురస్కరించుకొని “దక్షిణ అయోధ్య”గా ఖ్యాతిగాంచిన భద్రాచలంలో భక్తుల సందడి నెలకొంది. ప్రతిఏటా నిర్వహించే సీతారాముల కళ్యాణానికి ప్రాముఖ్యత కలిగిన శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం దశమి రోజున అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, అర్చకులు సంపూర్ణ సమన్వయంతో భక్తులకు శ్రద్ధాభక్తులతో ఈ ఘట్టాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచే భద్రాచలంలోని మిథిలా స్టేడియంకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. శ్రీరామచంద్ర స్వామివారి పట్టాభిషేక మహోత్సవానికి ముఖ్య…