కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న వేళ సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ పరిటాల శ్రీరామ్కు కరోనా సోకినట్లు ఆయన వెల్లడించారు. అయితే స్వల్పలక్షణాలతో ఆయన కరోనా పాజిటివ్గా తేలిందని, ఇటీవల తనను కలిసివారందరూ జాగ్రత్తగా ఉండండని ఆయన తెలిపారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే.. కరోనా రక్కసి రెక్కలు చాస్తోంది. దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్…