Pakistan Declares National Emergency: అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది.. మరోవైపు శ్రీలంక పరిస్థితి కళ్లముందు కనిపిస్తోంది దాయాది దేశానికి. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక కష్టాల మధ్య ఆ దేశాన్ని వరదలు, భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. వరదల వల్ల ఏకంగా 937 మందికి పైగా మరణించారు. 3 కోట్ల మంది నిరాశ్రయులు అయ్యారని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో భారీ వరదల కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వం ‘‘జాతీయ అత్యవసర పరిస్థితి’’ని ప్రకటించింది.