రంజాన్ మాసం చివరి దినాల్లో ఆప్ఘనిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో ఆప్ఘనిస్థాన్లోని కాబుల్, కందహార్, పక్తియా, పక్తికా వంటి ప్రదేశాల్లో భారీ నష్టం జరిగింది. మహిళలు, పిల్లలు చనిపోయారని ఆప్ఘనిస్థాన్ తెలిపింది.
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో అక్టోబర్ 11వ తేదీ నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దులను మూసివేశారు. దీంతో పాక్- అఫ్గాన్ ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది.