Pak-Afghan: పాక్-అఫ్గాన్ బోర్డర్ బంద్.. కిలో టమాటా రూ. 600!
- పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు..
- బోర్డర్ మూసివేతతో ఇరుదేశాల్లో భారీగా పెరిగిన పండ్లు, కూరగాయలు..
- పాకిస్థాన్ లో కిలో టమాటా ధర 600 పాక్ రూపాయలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో అక్టోబర్ 11వ తేదీ నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దులను మూసివేశారు. దీంతో పాక్- అఫ్గాన్ ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. బోర్డర్ మూసివేయడం వల్ల రెండు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు లాంటి నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఘర్షణకు ముందుతో పోలిస్తే పాక్లో టమాటా ధరలు 5 రెట్లు పెరిగినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం కిలో టమాటా ధర 600 పాక్ రూపాయలుగా అమ్ముతున్నట్లు సమాచారం. అఫ్గాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే యాపిల్ ధరలు కూడా భారీగా పెరిగిపోయినట్లు టాక్.
Read Also: Ponnam Prabhakar: తనిఖీలు చేయకపోవడం వల్లే ప్రమాదం.. టీజీ రవాణా శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
కాగా, సాధారణంగా పాక్- అఫ్గాన్ సరిహద్దు నుంచి ఏటా 2.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం కొనసాగుతుంది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు పెరగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా ఆపేశామని కాబుల్లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ తెలియజేశారు. దీంతో రోజుకు రెండు దేశాల్లో దాదాపు 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) నష్టం జరుగుతున్నట్లు సమాచారం. అఫ్గాన్ నుంచి పాక్కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు పాడైతునట్లు చెప్పుకొచ్చారు. సరిహద్దుకు రెండు వైపులా దాదాపు 5వేల కంటైనర్లు ఆగిపోయాయని పాక్ లోని ప్రధాన టోర్ఖామ్ సరిహద్దు క్రాసింగ్ దగ్గర ఉన్న ఓ అధికారి వెల్లడించినట్లు దాయాది దేశ మీడియా వర్గాలు కథనాలు ప్రచురించింది.
Read Also: Storyboard: టీడీపీ, జనసేన మధ్య వివాదాలేంటి..? ఎవరు గీత దాటుతున్నారు?
అయితే, గత కొన్ని రోజులుగా పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు చనిపోయారు. ఈ నేపథ్యంలో గత వారం ఖతార్లోని దోహాలో పాక్, అఫ్గాన్ రక్షణ మంత్రులు ఖ్వాజా ఆసిఫ్, ముల్లా యాకుబ్ల మధ్య చర్చలు కొనసాగాయి. ఇందులో భాగంగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నాయి. కానీ, సరిహద్దు వాణిజ్యం మాత్రం ఇంకా ఒపెన్ కాలేదు. రెండు దేశాల మధ్య తదుపరి రౌండ్ చర్చలు అక్టోబర్ 25వ తేదీన ఇస్తాంబుల్లో జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!