ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన కొరతపై నెలకొన్న ఆందోళనలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం అనేది మన నిత్యకృత్యం, కానీ అదే ఇప్పుడు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసే ప్రమాదంగా మారుతోంది. గ్యాస్ బుకింగ్ పేరుతో జరుగుతున్న ఈ భారీ మోసంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయన్న వార్తలను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ కొరత…
నిజామాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి దోపిడీకి పాల్పడ్డారు. వినాయకనగర్లో నివసించే వృద్ధ దంపతులను టార్గెట్ చేసి, “డిజిటల్ అరెస్ట్” పేరుతో భయపెట్టి ఏకంగా రూ.40 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో వృద్ధుడికి వాట్సాప్ వీడియోకాల్ వచ్చింది. తాము ముంబయి పోలీసులు అని పరిచయం చేసుకున్న నిందితులు నకిలీ ఐడీ కార్డులు చూపించారు. మీ బ్యాంకు ఖాతా మనీలాండరింగ్…