కాకినాడ జిల్లాలో బెంగాల్ టైగర్, చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు, శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి. వనాల్లో వుండాల్సిన వన్యప్రాణులు జనాల్లోకి వస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామంలో ఓ ఇంటిలో తిష్టవేసిన ఎలుగు బంటి జనాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించింది. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పి.రామ్మోహనరావు (ఐఎఫ్ఎస్) ఆధ్వర్యంలో ఆపరేషన్ బల్లూక్ నిర్వహించారు. ఎట్టకేలకు ఎలుగుబంటిని పట్టుకుని బోనులో బంధించారు. ఆపరేషన్ లో విశాఖ జూకి చెందిన మత్తు డాక్టర్,…
హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో వున్న మాదాపూర్ వడ్డెరబస్తీ వాసులు కలుషిత నీటితో నానా అవస్థలు పడుతున్నారు. కలుషిత నీటి బాధితుల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరికొందరు అస్వస్థతకు గురికావడంతో మొత్తం బాధితుల సంఖ్య 98కి చేరింది. వాంతులు, విరేచనాలతో కొత్తగా 15 మంది కొండాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 52 మంది చికిత్స పొందుతున్నారు. 26 మంది ఇప్పటివరకూ రికవరీ అయ్యారు. కొండాపూర్, గాంధీ…