హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న ప్రతిష్టాత్మక పార్క్ హయత్ హోటల్లో సోమవారం (ఏప్రిల్ 14, 2025) ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టమైన పొగలు హోటల్ను ఆవరించాయి. ఈ ఘటనతో హోటల్లో ఉన్నవారిలో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇక ఈ హోటల్లో ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ టీమ్…