Dr NTR Vaidya Seva Funds: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం (నెట్వర్క్) కింద ఆంధ్రప్రదేశ్లోని అనుబంధ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల్లో భాగంగా ప్రభుత్వం రూ. 250 కోట్లను విడుదల చేసింది. నిధుల చెల్లింపుల విషయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో జరిపిన చర్చల అనంతరం ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. అలాగే, త్వరలోనే మరో రూ. 250 కోట్లను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు…
NTR Vaidya Seva: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు మూడో రోజు కూడా నిలిచిపోయింది. ఈ పథకం కింద సేవలు అందించే స్పెషాలిటీ ఆసుపత్రులు తాత్కాలికంగా సేవలను ఆపేశాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రోగులకు చికిత్స అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.