సృష్టి సరోగసి అక్రమాల కేసులో ఏ1గా ఉన్న ఉన్న డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ నమ్రతకు వైద్య పరీక్షల కోసం నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరు పర్చనున్నారు. కస్టడీలో భాగంగా పలు అంశాలపై డాక్టర్ నమ్రతాను పోలీసులు విచారించారు.
హైదరాబాద్ లో నకిలీ ట్రాన్స్ జెండర్ల బెగ్గింగ్ మాఫియాలో కొత్తకోణం వెలుగులో వచ్చింది. రాజేష్, అనితలు కలిసి నకిలీ ట్రాంజెండలను తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. రాజేష్, యాదవ్ ల దగ్గర వంద మందికి పైగా నకిలీ ట్రాన్స్ జెండర్.. ఉదయం నుంచి సాయంత్రం వరకు చౌరస్తాలో బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు.