దక్షిణ చైనా సముద్రంతో పాటుగా, డ్రాగన్ దేశం హిందు మహాసముద్రంపై కూడా కన్నేసింది. ఈ ప్రాంతంలోని జలాలపై ఆదిపత్యం సాధించేందుకు అనేక ప్రాంతాల్లో పోర్టులను నిర్మిస్తోంది. హిందూ మహాసముద్రం పరిధిలోని చిన్న చిన్న దేశాల్లో పోర్టులను నిర్మిస్తూ ఆయా ప్రాంతాలపై పట్టు సాధిస్తోంది. దీంతో అలర్టైన ఇండియా హిందు మహాసముద్రంపై నిఘాను పెంచేందుకు చర్యలు చెపట్టింది. మారిషస్లోని ఉత్తర అగలేగాలో 25 కోట్ల డాలర్లతో పోర్టును నిర్మిస్తోంది. ఇందులో 3000 మీటర్ల పొడవైన రన్వే కీలకమైనది. పెద్ద…