సార్వత్రిక ఎన్నికల రెండో ఘట్టం దగ్గర పడింది. ఏప్రిల్ 26నే రెండో విడత పోలింగ్ జరగనుంది. దీంతో నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక విమర్శలు-ప్రతి విమర్శలతో నాయకులు ధ్వజమెత్తుకుంటున్నారు
దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు వర్షం దెబ్బకి నానా అవస్థలు పడుతున్నాయి. భారీ వర్షాలతో పలు రాష్ట్రాల్లోని గ్రామాలు పూర్తిగా వరద ప్రభావంతో అస్థవ్యస్థం అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, మరోసారి భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలను జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాలు కుంభవృష్టితో అల్లకల్లోలం అవుతున్నాయి. ఎన్నడూలేనంతగా భారీ వర్షాలతో ప్రజలు అల్లలాడుతున్నారు. ఉత్తరాది రాష్ర్టాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.