దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా గ్రీన్లోనే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 285 పాయింట్లు లాభపడి 81,741 దగ్గర ముగియగా.. నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 24, 951 దగ్గర ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలంగా ఉండడంతో ఉదయం సరికొత్త రికార్డులు నమోదు చేసిన సూచీలు... అనంతరం నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఫ్లాట్గా ముగిశాయి.
Stock Market Record : మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్, నిఫ్టీ కొత్త ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేశాయి. ఎన్ఎస్ఇ నిఫ్టీ 24,980.45కి చేరగా, బిఎస్ఇ సెన్సెక్స్ 81,749.34 వద్ద సరికొత్త చరిత్రాత్మక శిఖరాన్ని తాకింది.
Nifty: గత వారం బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లో క్షీణత కనిపించింది. అయితే శుక్రవారం ఒక్క రోజులో కోలుకుంది. దీనికి ప్రధాన కారణాలు అమెరికా జీడీపీ గణాంకాలు. శుక్రవారం స్టాక్ మార్కెట్ లో కనిపించిన పెరుగుదల ఇన్వెస్టర్లు, నిపుణుల్లో ఆశలు రేకెత్తించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత కూడా ఎలాంటి మార్పులు కనిపించలేదు. గత శుక్రవారం మైక్రోసాప్ట్ విండోస్ సమస్యతో మొదలైన నష్టాలు.. వరుసగా నాలుగో రోజు కూడా అదే ఒరవడి కొనసాగింది.
మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సమస్య కారణంగా అన్ని సంస్థలను అతలాకుతలం చేసింది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించింది. గురువారం సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్టాలను నమోదు చేసిన సూచీలు.. శుక్రవారం మాత్రం అందుకు భిన్నంగా తిరోగమనంలో కొనసాగాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి వరుస లాభాల్లో దూసుకెళ్లాయి. సోమవారం జీవితకాల గరిష్టాలను నమోదు చేయగా.. మంగళవారం కూడా భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లాయి.