OnePlus-11(5G) to launch in India: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ‘వన్ ప్లస్’.. సరికొత్త మోడల్ సెల్ఫోన్ను స్వదేశంలో జనవరి 4వ తేదీన.. అంటే.. బుధవారం నాడు లాంఛ్ చేయబోతోంది. ఇండియాలో మాత్రం నెల రోజులు ఆలస్యంగా అందుబాటులోకి తీసుకురానుంది. లేటెస్ట్ లెవెన్ సిరీస్లో 5జీ టెక్నాలజీతో రూపొందించిన ఈ అప్డేటెడ్ మొబైల్ ఫోన్ను ఫిబ్రవరి 7వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న క్లౌడ్-11 ఈవెంట్లో ఆవిష్కరించనుంది.