తెలంగాణ-ఆంధ్ర రెండు రాష్ట్రాల మత్స్యకారుల మధ్యలో నెలకొన్న సరిహద్దు వివాద సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి మత్స్యకారుల సమస్యను పరిష్కరిం చేందుకు ప్రత్యేక కృషి చేస్తానని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ తెలిపారు. మంగళవారం కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరం పరిసర ప్రాంతంలో ఉన్న కృష్ణా నదిలో చేప పిల్లలను వదిలారు. అనంతరం మత్స్యశాఖ జె.డి శ్యామలమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మత్స్యకారుల నుద్దేశించి మాట్లాడుతూ ఎన్నోఏళ్ల నుంచి కృష్ణా నదిలో చేపల…