HYDRA: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్లో శ్మశాన వాటికలపై జరిగిన అక్రమ కబ్జాలను తొలగించేందుకు అధికారులు విస్తృతంగా చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున నుంచే హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రారంభించారు. పర్వతాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 1, 12లో ఉన్న ముస్లిం , క్రిస్టియన్ శ్మశాన వాటికలపై కొంతకాలంగా భూకబ్జాదారులు కబ్జా చేసి, అక్రమంగా నిర్మాణాలు చేపట్టి అమ్మకాలు నిర్వహించినట్లు సమాచారం. గత రెండు ఏళ్లుగా…
Footpath Encroachment : రంగారెడ్డిలోని బండ్లగూడలో మునిసిపల్ అధికారులు ఫుట్పాత్ ఆక్రమణలపై కొరడా ఝుళిపించారు. ఫుట్ పాత్పై వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పాదచారులు నడిచే పుట్ పాత్ ను ఆక్రమించుకొని వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు వ్యాపారస్తులు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అదేశాల మేరకు బండ్లగూడ జాగీర్ మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫుట్ పాత్ కబ్జా చేసి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో…