సమ్మక్క-సారక్క జాతర ముగియగానే ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గురువారం తెలిపారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. “నీతి ఆయోగ్ యొక్క 2019-20 ఆరోగ్య సూచీలో పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానాన్ని పొందగా, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ దిగువన ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. రాష్ట్ర…
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. కొండాపూర్- ఆలుబాక గ్రామాల మధ్య పట్టపగలు మావోయిస్టులు గోడపత్రికలు విడిచిపెట్టారు. వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ పేరు మీదుగా పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు ఇన్ఫార్మర్లను హెచ్చరిస్తూ పోస్టర్లు ముద్రించారు.బొల్లారం, సీతారాంపురం, కలిపాక గ్రామాలకు చెందిన కొంతమంది పేర్లు ప్రకటించారు. తమ గురించి పోలీస్ లకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని మావోయిస్ట్ పార్టీ నష్టానికి సహకరిస్తున్నారు అని పోస్టర్లో పేర్కొన్న మావోలు. ఇన్ఫార్లకు హెచ్చరికలు జారీచేయడంతో ఆందోళన…