తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి. గతంలో వానాకాలం పంటలపై ఈసారి ఎలాంటి ఆంక్షలు విధించబోమన్నారు. వరితో పోల్చితే ఇతర పంటలు లాభదాయకంగా వుంటాయని మంత్రి తెలిపారు. రైతులకు ఇష్టమైన పంటలు పండించుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఇతర పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్టు ఆయన తెలిపారు. వానకాలం పంటలపై ఆంక్షలు పెడుతున్నారంటూ సాగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వరిపై ఆంక్షలు లేవని, లాభసాటి…
అమ్మబోతే అడవి… కొనబోతే కొరివి అన్నట్టుగా తయారైంది కొబ్బరి రైతుల దుస్థితి. కన్నకొడుకు ఆదుకున్న లేకపోయినా కొబ్బరి చెట్టు ఆదుకొంటుందని కోనసీమ వాసుల నమ్మకం. కొబ్బరి చెట్టును కల్పతరువుగా పూజిస్తారు కోనసీమ వాసులు . కొబ్బరి ఉత్పత్తుల పేరు చెబితే గుర్తొచ్చేది కేరళ తరువాత కోనసీమ కొబ్బరి మాత్రమే. గత కొన్ని ఏళ్లుగా కోనసీమ కొబ్బరి రైతులు దిగుబడి లేక నల్లి తెగుళ్ల వల్ల ఉత్పత్తి తగ్గిపోయి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో మార్పుల వలన…
తెలంగాణలో ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రంపై టీఆర్ఎస్ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రుల సమావేశం ముగిసింది. అరగంటపాటు సాగింది ఈ సమావేశం. పంజాబ్ నుంచి ఏ తరహాలో అయితే బియ్యాన్ని కేంద్రం సేకరిస్తుందో, తెలంగాణ నుంచి కూడా అదే తరహాలో బియ్యాన్ని సేకరిస్తుంది. ఏ రాష్ట్రం పట్ల కేంద్రం ఎలాంటి వివక్షతతో వ్యవహరించదన్నారు కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.…
దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ప్రాంతాల్లోని పంటల సాగు, ఇతర అంశాల ఆధారంగా కనీస మద్దతు ధర (ఎంఎస్పి) నిర్ణయించాలని, రాష్ట్రాలు నిర్ణయించిన ఎంఎస్పీకి కేంద్రం మొత్తం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని వ్యవసాయ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో 60 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగంపై కేంద్రం తన విధానాన్ని మార్చుకోవాలని పేర్కొంటూ, “కేంద్రం ఎమ్ఎస్పిని ప్రకటించి, సేకరణ బాధ్యతల నుండి చేతులు కడుక్కుంటోంది. ఇది శోచనీయం.” స్వామినాథన్ కమిటీ సిఫార్సులను…
రైస్ మిల్లర్ల తీరు పై స్పీకర్ తమ్మినేని సీతారాం హాట్ కామెంట్స్ చేశారు. ధాన్యం కొనుగోలుపై మిల్లర్ల తీరు పై మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని. ధాన్యం క్వింటాకు మేలు రకం 1960 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించింది. పైసా తక్కువ ఇచ్చినా ధాన్యం తీసుకోకపోయినా లైసెన్స్ రద్దు చేస్తాం అని హెచ్చరించారు. మిల్లర్స్ తమాషాలు చేస్తున్నారని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార లావాదేవీలు మినహా రైతుల కష్టనష్టాలు వారికి పట్టడంలేదన్నారు. ప్రభుత్వ ధరకు కొనకుండా తిరస్కరిస్తే ఇతర…
కేంద్రం కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాల్సిందే.. లేకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు సంయుక్త కిసాన్ మెర్చా నేత రాకేష్ టికాయత్.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేస్తున్న ఆందోళన ఏడాది దాటింది.. ఇక, ఆ వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు.. అయితే, కనీస మద్దతు ధర చట్టం తెచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి..…