ఎన్నిలక కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన ఉండగా.. ఫిబ్రవరి 13న నామినేషన్లు ఉపసంహరణకు గడువుగా పెట్టింది ఎన్నికల కమిషన్.. ఇక, ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. తెలంగాణలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనచారి, రవీందర్రావు, ఎల్. రమణ, గుత్తా సుఖేందర్రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ రేసులో ముందున్నట్లు ప్రచారం జరగుతోంది. వీరితో పాటు మరికొంత మంది ఆశావహులు ప్రగతి భవన్ చుట్టూ…