తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్పై ఈడీ కీలక చర్యలు తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో అనితా రాధాకృష్ణన్కు చెందిన రూ.1.26 కోట్ల విలువైన ఆస్తులను దర్యాప్తు సంస్థ జప్తు చేసింది. తూత్తుకుడి, మదురై, చెన్నైలలో అనితా రాధాకృష్ణన్కు చెందిన స్థిరాస్తులను అటాచ్ చేయాలని పీఎంఎల్ఏ కింద ఆదేశాలు జారీ చేసినట్లు ఈడీ తన ప్రకటనలో తెలిపింది.