పాతబస్తీలో చార్మినార్ సమీపంలో ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ గౌస్ కుమారుడు మహమ్మద్ సాహిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు పోలీసుల బందోబస్తుతో అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో అధికారుల పనిని అడ్డుకున్న సాహిల్, వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా విధుల్లో ఉన్న పోలీస్…