కలియుగంలో ఏదైనా జరగవచ్చని చాలా మంది చెబుతుంటారు. అయితే ఈ మధ్య వస్తున్న వార్తలను బట్టి ఇది నిజమే అనిపిస్తోంది. దేశంలో మోసగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు అనేక పద్ధతులను రూపొందిస్తున్నారు. ఇలాంటి కథే గుజరాత్లోని సూరత్ నుంచి వెలుగులోకి వచ్చింది. నకిలీ వైద్య పట్టాలను విక్రయిస్తున్న రాకెట్ను సూరత్ పోలీసులు గురువారం ఛేదించారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. ఇందులో సూత్రధారులు.. నకిలీ సర్టిఫికేట్ల ఆధారంగా వైద్యులుగా పనిచేస్తున్న వ్యక్తులు కూడా…