మేడారం మహాజాతర ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాదిమంది భక్తులు వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో కిటకిటలాడుతూ మేడారం జనసంద్రమైంది. ఈ జాతరలో కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన సమ్మక్క సారలమ్మ తల్లులకు భక్తులు కానుకలు సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుండి మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు. హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. Also Read:Lenin…