Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ మన్కడింగ్ రనౌట్కు ప్రయత్నించగా రోహిత్ శర్మ నిరాకరించాడు. షమీ చేసిన అప్పీల్ను వెనక్కు తీసుకునేలా చర్యలు తీసుకుని అందరి మనసులను గెలుచుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే.. శ్రీలంక ఇన్ని్ంగ్స్ జరుగుతున్న సమయంలో మహ్మద్ షమీ చివరి ఓవర్ వేశాడు. అయితే నాలుగో బంతి సమయంలో శ్రీలంక కెప్టెన్ షనక 98 పరుగులతో నాన్ స్ట్రైకింగ్లో…